హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వకుర్తి మండలం తర్నికల్ వద్ద ప్రమాదవశాత్తు కారు పొల్లాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో ఓ బాలుడు తీవ్ర గాయాలకు గురవగా.. అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. మృతుడికి, క్షతగాత్రులతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.