హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): లండన్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో బోనాల జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యూకే నలుమూలల నుంచి ప్రవాస కుటుంబాల సభ్యులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హౌంస్లౌ నగర మేయర్ ఆఫ్గల్ కియానీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు సమాజ సేవలో ముందున్నారని కొనియాడారు. టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ టాక్ సంస్థ బోనాల జాతర పోస్టర్ను ఆవిషరించారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని ఎన్నారైలంతా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సంస్థ ఉపాధ్యక్షురాలు శుషుమనరెడ్డి, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు, టాక్ జాతీయ కన్వీనర్ అశోక్, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.