ఎన్నారైల సేవలు అభినందనీయం
‘టాక్’ బోనాల జాతరలో బ్రిటన్ ఎంపీ
నృత్యాలతో హోరెత్తిన లండన్ వీధులు
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని బ్రిటన్లో భారత సంతతికి చెందిన ఎంపీ వీరేంద్రశర్మ పేర్కొన్నారు. యూకేలో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలు సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని చెప్పారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో ఘనంగా బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నారైలు దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. జాతరకు స్థానిక ఎంపీలు వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, రూత్ కాడ్బరీ, డిప్యూటీ మేయర్ హౌన్సలౌ తదితరులు హాజరయ్యారు. విదేశాల్లో ఉన్నా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయటం గొప్ప విషయమని ఎంపీ వీరేంద్రశర్మ ప్రశంసించారు. లండన్ వీధుల్లో బోనాల తొట్టెల ఊరేగింపు చూసి చాలా గర్వపడుతున్నానని, టాక్ కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయని మెచ్చుకున్నారు.
అక్షయ్ ఎం.. పోతరాజు వేషధారణలో ఆకర్షించగా.. సందీప్కుమార్ బుక్క ఆధ్వర్యంలోని పోతురాజుల విన్యాసాలు లండన్వాసులను కనువిందు చేశాయి. సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ విశిష్టమైన నేల అని టాక్ అధ్యక్షుడు రత్నారకర్ కడుదుల పేర్కొన్నారు. లిమా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత రాగసుధా వింజమూరి చేసిన మహాశక్తి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో టాక్ ఉపాధ్యక్షురాలు సుష్మనరెడ్డి, సంస్థ అధికార ప్రతినిధి హరిగౌడ్, టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు అశోక్ దూసరి, అడ్వైసరీ చైర్మన్ మట్టారెడ్డి, సభ్యులు, సత్య చిలుముల, పవిత్రరెడ్డి కంది, నవీన్రెడ్డి, స్వాతి బుడగం, రాకేశ్ పటేల్, సత్య పింగిళి, సత్యం కంది, హరి నవపేట్, సుప్రజ, వీరప్రవీణ్కుమార్, సురేశ్ బుడగం, క్రాంతి, శ్వేతామహేందర్, శ్రీలక్ష్మి, రవికిరణ్, గణేశ్, మధుసూదన్రెడ్డి, మల్రెడ్డి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.