శంషాబాద్ రూరల్, జనవరి 21: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మరికొద్ది క్షణాల్లో పేల్చి వేస్తామంటూ జీఎమ్మార్ కాల్ సెంటర్కు ఫోన్చేసి బెదిరించిన ఘటన ఆదివారం కలకలం సృష్టించింది. ఎయిర్పోర్టు అధికారులు, పోలీసుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టును పేల్చివేస్తామంటూ ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్లోని కాచిగూడలో చాయ్ తాగుతూ మాట్లాడుకుంటుండగా, తాను విన్నట్టు స్థానికుడైన ప్రశాంత్ అనే వ్యక్తి జీఎమ్మార్ కాల్ సెంటర్కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్టు అధికారులతోపాటు పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదని ధ్రువీకరించారు.