Krishna Express | తిరుపతి- ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులతోపాటు హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు భారీగా పోలీసు బలగాలు తరలి వచ్చారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసు బలగాలతోపాటు వివిధ విభాగాలకు చెందిన పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
ఇదిలా ఉండగా, మౌలాలీ స్టేషన్ వద్ద కృష్ణా ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. బోగీలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో బోగీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.