హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలకు ఇది చక్కటి పరిష్కార మార్గమని చెప్పారు. ధరణి పోర్టల్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ప్రజలను తప్పదోవ పట్టించేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. దశాబ్దాల కాలం నుంచి అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులను ధరణి ద్వారా ఒక పద్ధతి ప్రకారం సరిచేసుకునే వెసులుబాటు కలిగిందని తెలిపారు. ధరణి ద్వారా ఇప్పటివరకు 95 శాతం రెవెన్యూ రికార్డుల్లోని సమస్యలు పరిషారం అయ్యాయని వెల్లడించారు. త్వరలోనే మిగిలిన సమస్యలు సైతం కొలిక్కి వస్తాయని చెప్పారు. ఆచరణలో ఎదురవుతున్న దశాబ్దాల కాలం నాటి రెవెన్యూ సమస్యలు అకడకడ కొన్ని అధికారుల దృష్టికి వస్తున్నాయని చెప్పారు.
కుటుంబ కలహాలు, భూముల సరిహద్దు వివాదాలు, పూర్వపు క్రయ విక్రయాల సమస్యలు, టెక్నికల్ మాడ్యుల్ (టీఎం ) – 33 లో కొన్ని అంశాలు మాత్రమే కలెక్టర్ల వద్ద పరిషారం కోసం ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని కూడా దశలవారీగా కొలికి తీసుకొస్తున్నారని తెలిపారు. పూర్తిగా పారదర్శకతతో ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ధరణి సిస్టంను తప్పు పట్టడం కిషన్రెడ్డికి తగదని, సరైన ఆధారాలతో సమస్యలను చూపితే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ధరణి వ్యవస్థ అమలులోకి వచ్చిన నాటి నుంచి రెవెన్యూ రికార్డులు అన్నీ సాఫీగా సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ధరణి వ్యవస్థను కేంద్ర వ్యవసాయ, ఐటీ మంత్రిత్వశాఖల అధికారులు మెచ్చుకున్నారని, ధరణి తరహా వ్యవస్థను దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని కేంద్రమంత్రిత్వశాఖల అధికారులు సూచించారని వినోద్కుమార్ గుర్తు చేశారు.