జమ్మికుంట, సెప్టెంబర్ 9: ‘దేశంలో కోట్లాదిమంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు. వీరు చాలీచాలని వేతనాలతో బతుకులను వెళ్లదీసున్నారు. ప్రైవేట్ టీచర్ల సంరక్షణ చట్టం కోసం ఉద్యమిస్తా..ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఒత్తిడి తెస్తా’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ కుమార్ అన్నారు. తాను ఎంపీగా ఉన్న కాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించిన. ఇప్పుడు వారి అభ్యున్నతి కోసం పోరాటం చేస్తా..హైదరాబాద్ లక్ష మంది టీచర్లతో సమావేశం నిర్వహించి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
శనివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ట్రస్మా ఆధ్వర్యంలో గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చాలీ, చాలనీ వేతనాలతో జీవనం కొనసాగిస్తున్న ఉపాధ్యాయులకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటుందని చెప్పారు టీచర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో ఉపాధ్యాయలకు అందించిన సాయాన్ని గుర్తు చేశారు. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులకు ఇబ్బందులున్నాయని, వాహనాల ట్యాక్సీ మాఫీ విషయంపై సీఎం దృష్టికి తీసుకెళ్తనాని చెప్పారు.
తెలంగాణ వస్తే చీకటేనని నాటి సీఎం కిరణ్ అన్నారని, 24గంటల విద్యుత్ నిరంతరం అందిస్తున్న విషయాలను వివరించారు. బీజేపీ ఎమ్మెల్యే గ్రామాల్లో కరెంటు ఉండటం లేదనడం హాస్యాస్పదమని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాత్రి పూట రైతులు పొలాల వద్దకు పోతున్నారా? చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఏ విద్యుత్ తీగనైనా ముట్టుకొని చూసి మాట్లాడాలన్నారు. ఎత్తిపోతల పథకాల ద్వారా అదనంగా కోటి ఎకరాలకు నీరందుతున్నదని తెలిపారు.
ఏడుసార్లు అవకాశం ఇచ్చినా ఈటల అభివృద్ధి చేయలేదని, ఒకే ఒక్క అవకాశం ఇస్తే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని మండలి విప్, బీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ పాడి కౌశిక్ పేర్కొన్నారు. పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలని, ఎంపీగా వినోద్ ఎమ్మెల్యేగా కౌశిక్ ఉపాధ్యాయులు మద్దతు పలుకాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ పిలుపునిచ్చారు.