కాజీపేట/మడికొండ, జూలై 12: ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ డిమాం డ్ చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా కాజీపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1980లో హ నుమకొండ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన పీవీ నర్సింహారావు 1982లో కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయించారని గుర్తుచేశారు. అప్పట్లోనే ఆ కోచ్ ఫ్యాక్టరీ కోసం మడికొండ, రాంపూర్, అయోధ్యపు రం, తరాలపల్లి, పెండ్యాల్ తదితర ప్రాంతా ల్లో వేలాది ఎకరాల భూమిని సర్వే చేశారని తెలిపారు. 40 ఏండ్లుగా ఈ ప్రాంత ప్రజలు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎన్నో ఉద్యమాలు చేశారని చెప్పారు. 2018లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ప్రధాని మోదీ మహారాష్ట్రలోని లాథూర్కు కోచ్ ఫ్యాక్టరీ, 2022లో గుజరాత్ ఎన్నికల సభలో గుజరాత్కు లోకోమోటివ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని గుర్తుచేశారు. కానీ.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పా టు చేయాలని ఇక్కడి ప్రజలు ఎన్నో ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు చేసిన ఫలితం గా.. ఈ నెల 8న ప్రధాని మోదీ కాజీపేటలో రైల్వే వ్యాగన్ పీవోహెచ్ను రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా అప్గ్రేడ్ చేసి శంకుస్థాపన చేశారని తెలిపారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఒకప్పుడు రైల్వే కార్మికులతో కళకళలాడిన కాజీపేట రైల్వే జంక్షన్ సీమాంధ్ర పాలనలో వెలవెలబోయిందని అన్నారు.
వ్యాగన్ పరిశ్రమ స్థల పరిశీలన
అయోధ్యపురంలో ఏర్పాటయ్యే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్లతో కలిసి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సందర్శించారు. పరిశ్రమ నమూనాను పరిశీలించి పనితీరును, ఉపాధి అవకాశాలు, పరిశ్రమ సామర్థ్యం వంటి అంశాలను కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు.