మల్యాల, నవంబర్ 24: ‘తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నాయకుల పెత్తనం అవసరమా? ఎన్నికల ప్రచారంలో వారి హం గామా ఏంది? అటు ఢిల్లీ గులాంలు.. ఇటు వీళ్లు.. అక్కడ ఐదు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసినోళ్లు.. ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తరో ఆలోచించాలి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ప్రజలకు సూచించారు. శుక్రవారం సాయంత్రం మల్యాలలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్తో కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ 20 రిజర్వాయర్లను నిర్మించి సాగునీటి నీటి కొరతను తీర్చినట్టు చె ప్పారు. విద్యుత్తు ఉత్పాదక కేంద్రాలు ఏర్పాటు చేసి మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను, చొప్పదండి అభ్యర్థిగా రవిశంకర్ను గెలిపించాలని కోరారు.