కరీంనగర్ : ఇరవై ఏండ్ల కింద తెలంగాణ ఎట్లా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు ఆలోచన చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (Boinapalli Vinod Kumar ) అన్నారు. సోమవారం మానకొండూరు(Manakonduru) నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం సాధించాక ముఖ్యంగా నీరు, కరెంట్ వంటి సమస్యలను సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ దేశంలోనే తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారన్నారు.
తెలంగాణ తెస్తామని మాట తెచ్చినం. ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి ఇచ్చినం. కోటి ఎకరాలకు సాగు నీరందించి కేసీఆర్ చరిత్ర సృష్టించారన్నారు. రాష్ట్రాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు వచ్చే ఎన్నికల్లో మానకొండూరులో రసమయి బాలకిషన్ను, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలన్నారు.