కరీంనగర్ : గులాబీ జెండా పార్టీ(BRS) పెట్టి తెలంగాణ (Telangana) తెస్తామని చెప్పినం. తెచ్చి చూపించినం. ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తమని చెప్పినం. ఇచ్చి చూపించినం అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్(Boinapalli Vinod Kumar) అన్నారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటి ఎకరాలకు కృష్ణా, గోదావరి జలాలు అందించి మాట నిలబెట్టుకున్నాం.
ఎండా కాలంలో కూడా గ్రామాల్లో చెరువులు మత్తలు దుంకుతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజల పట్ల ప్రేమ ఉండదన్నారు. వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీల చేతిలోకి తెలంగాణ పోతే కుక్కలు చింపిన ఇస్తారకు అవుతుంది. తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను మరోసారి గెలిపించాలన్నారు.