హైదరాబాద్ : మితభాషి, వృత్తి పట్ల నిబద్దత కలిగిన జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ ఆకస్మిక మృతి బాధాకరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
అన్నారు. మెండు శ్రీనివాస్తో తనకు ఉన్న అనుబంధాన్ని వినోద్ కుమార్ గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కాగా, శ్రీనివాస్ వరంగల్ జిల్లాలోని తన స్వగ్రామం పరకాలలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో స్థానిక దవాఖానలో చేరారు. అయితే చికిత్స పొందుతూ చనిపోయారు. శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి స్టేట్ బ్యూరోచీఫ్గా పనిచేస్తున్నారు.