హైదరాబాద్ : ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను(MLA Camp Office) గొప్ప ఆలోచనలతో నిర్మించాం. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapalli Vinod Kumar) అన్నారు. అచ్చంపేట నియోజకవర్గక క్యాంపు కార్యాలయంలోని శిలాఫలకాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదు.
అధికార పార్టీలు మారినంత మాత్రాన శిలాఫలకాలు తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే సమర్ధిస్తాం. చెడు చేస్తే విమర్శిస్తామన్నారు. బీఆర్ఎస్ ఏర్పడిందే తెలంగాణ కోసమని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు.