కౌటాల, డిసెంబర్ 29 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఇందులో భాగంగా బుధవారం కౌటాల మండలం తాటిపల్లిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పెన్గంగ నదిలో పడవ నడిపే వారికి ఎంపీవో శ్రీధర్ రాజు వైద్య సిబ్బందితో టీకా వేయించారు.
అలాగే మిరపతోటలో పనిచేసే రైతులు, కూలీలు, వాహనాలు ఆపి డ్రైవర్లకు టీకా వేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రజిత, ఏఎన్ఎం జిహ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్త ఉన్నారు.