హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా, టీఎస్ఆర్టీసీ అన్ని డిపోల్లో శనివారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు.
అన్ని రీజియన్ల మేనేజర్లు, డిపోల మేనేజర్లు, అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని రక్తదానాలు చేయించాలని కోరారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు, యువకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.