వనపర్తి : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యాతారాహిత్యానికి నిరసనగగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై నల్లజెండా ఎగరవేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై వనపర్తి క్యాంపు కార్యాలయంలో మార్కెట్ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతుల నిరసన సెగ ఢిల్లీకి తగలాలన్నారు. తెలంగాణ బీజేపీ నేతలది చేతగానితనం. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి ఈ రాష్ట్రానికి, రైతాంగానికి చేసింది ఏమీ లేదన్నారు. రైతుల ఆందోళనలు చూసైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. లేకుంటే తెలంగాణ ఆగ్రహజ్వాలలు రేపు దేశమంతా అలుముకుంటాయని హెచ్చరింఆరు. రేపు జిల్లా కేంద్రంలో ధర్నా, ఎల్లుండి గ్రామాల్లో ఇండ్లపై నల్లజెండాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.