హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా సోమవారం ‘రైతు దీక్ష’ చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తానని, కొత్తగా లోన్లు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి రైతులను రెచ్చగొట్టారని చెప్పారు. ఇప్పుడు రుణమాఫీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. వడ్డీలు పెరిగి రైతులపై భారం పడుతున్నదని, రైతులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. కుంభకోణాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. అలాంటి పార్టీ నేత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ మ్యానిఫెస్టోపై మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఏపీ సీఎం జగన్పై రాయిదాడిపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రిపై ఎవరు దాడి చేసినా మంచి సంప్రదాయం కాదని, దర్యాప్తు జరిపి, దోషులకు శిక్ష పడాలని కోరారు.