ఖలీల్వాడి, ఆగస్టు 14: బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిజామాబాద్లో ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే అసంతృప్తవాదులు రోజురోజుకూ పెరుగుతున్నారు. అర్వింద్ వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఇటీవల ఏకంగా బీజేపీ కార్యాలయంలోనే నిరసనలకు దిగారు. జిల్లా పార్టీ కార్యాలయాన్ని ము ట్టడించారు. అర్వింద్ గ్రూపు రాజకీయాలు తట్టుకోలేక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సీనియర్ నేత వినయ్రెడ్డి సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేయడం ఇందూరులో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అర్వింద్ వికృత చేష్టలతో విసుగెత్తి పార్టీకి రాజీనామా చే స్తున్నట్టు ప్రకటించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ఆర్మూర్లో అత్యధిక మెజార్టీతో అర్వింద్ను గెలిపిస్తే.. తనపైనే కక్షగట్టి పార్టీకి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి అందజేశారు.