చండూరు : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి దిమ్మ తిరిగేలా ఓటర్లు తగిన తీర్పు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మండలం బోడంగిపర్తిలో శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు.
బీజేపీ కుట్రలో భాగంగా వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ప్రచార సరళి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతోషం వ్యక్తం చేశారన్నారు. ప్రతిరోజూ రెండు, మూడుసార్లు మానిటర్ చేశారని వెల్లడించారు. ఈనెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలి వచ్చేలా బోడంగిపర్తి, శిర్ధేపల్లి, తాస్కానిగూడెం గ్రామాల నాయకులకు సూచించారు.
ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గొస్కుల జలంధర్, రాజేశ్, ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, చిట్టిబాబు, ముత్యాల బలరాం రెడ్డి, లింగమూర్తి, సురేందర్ రావు, కట్కూరు సత్తయ్య, మూగల సత్యం, పడిదం వెంకటేశ్, పెద్దూరి భరత్, భాస్కర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.