హైదరాబాద్, ఫిబ్రవరి25 (నమస్తే తెలంగాణ): వికలాంగుల హక్కుల కోసం ఏండ్లుగా పనిచేస్తున్న అఖిల భారత వికలాంగుల వేదిక జాతీయ అధ్యక్షుడు, బీజేపీ దివ్యాంగుల విభా గం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావుకు తెలంగాణలో ఏదైనా ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలని తెలంగాణ వికలాంగుల హకుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి జేఏసీ చైర్మన్ మహంకాళి రవీందర్, అధ్యక్షుడు పులిపాటి శ్రీనివాస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 25 ఏండ్లుగా వికలాంగుల హకుల కోసం నాగేశ్వరరావు పోరాడుతున్నారని, బీజేపీలో కొన్నేండ్లుగా ఆయన సేవలందిస్తున్నారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.