యాదాద్రి భువనగిరి జిల్లా : మతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్న మతోన్మాద శక్తులను మునుగోడు ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఆయిల్ఫెడ్ చైర్మన్, యాదాద్రి భువనగిరి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల లో భాగంగా సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామంలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రాంత ప్రజల అభివృద్ధికి ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు.
ఓటర్లకు మాయమాటలు చెప్పి డబ్బుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గాలయ్య, మండల అధ్యక్షుడు భాస్కర్, సీపీఎం మండల అధ్యక్షుడు యాదిరెడ్డి, జనగాం సర్పంచ్ కలమ్మ ,ఎంపీటీసీ రాములమ్మ పెంటయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.