హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అమిత్ షా సభపై బీజేపీ శ్రేణులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయని, మునుగోడు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యా ఖ్యానించారు. మునుగోడులో ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ అఖండ విజ యం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
అమిత్షా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, నినాదాలకు సభికుల నుంచి కనీస స్పందన రాలేదని, దీంతో ఆయన 15 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి వెనుదిరిగారని పేర్కొన్నా రు. బీజేపీ తెలంగాణ నాయకుల ఆశలు, అంచనాలు తలకిందులై, వాళ్ల ముఖాలు వెలవెలబోయాయని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం, బేగంపేట నుంచి హెలికాప్టర్ వేసుకొని వచ్చి, జనాన్ని తరలించేందుకు, సభ ఏర్పాట్లకు ఖర్చు చేసిన కోట్ల రూపాయలు వృథా అయ్యాయని అన్నారు.