హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడారో సీఎం రేవంత్రెడ్డి స్పష్టత ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడి యాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టానికి రావాల్సిన న్యాయమైన నీటి వాటాపై రేవంత్రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. కర్ణాటకలో ప్రతిపాదిత 35 టీఎంసీల నవేలి రిజర్వాయర్, ఏపీలోని 20 టీఎంసీల గుండ్రేవుల ప్రాజెక్టు కారణంగా రాష్ర్టానికి రావాల్సిన 15.9 టీఎంసీల నీటి వాటాపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈనెల 28నుంచి 30వరకు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లాలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, మరో 9జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు.