హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీయే తమకు ప్రథమ ప్రత్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి చెప్పారు. బుధవారం జీహెచ్ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్సే ప్రత్యర్థి అని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు తెలిసిం ది. ఎట్టి పరిస్థితుల్లోనూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లతో కలువొద్దని స్పష్టం చేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం వంటివి కూడా చేయవద్దని చెప్పినట్టు తెలిసింది. ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలతో కలిసి పోరాడాలని సూచించారు.