Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వెనుకంజలో ఉంది. ఆ పార్టీకి చెందిన ప్రధాన నాయకులు కనీసం పోటీ ఇవ్వలేకపోతున్నారు. కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్, హుజురాబాద్లో ఈటల రాజేందర్, కోరుట్లలో ధర్మపురి అరవింద్, దుబ్బాక రఘునందన్ రావు, గోషామహల్లో రాజాసింగ్ మూడో స్థానంలో ఉన్నారు. మొదటి రౌండ్లో వీరికి ఆధిక్యం ఉన్నప్పటికీ, తర్వాతి రౌండ్లలో వెనుక పడిపోయారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇక కార్వాన్, సిర్పూర్ కాగజ్ నగర్, నిర్మల్, ముథోల్, బోథ్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్లో ఉంది.