Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ పటిష్టత ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ సాధనలో బాసటగా నిలిచేందుకు, బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై లక్షమణచాంద మండలం తిర్పెల్లి గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. యువకులు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిర్మల్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నిర్మల్ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంతో నిర్మల్ రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గులాబీ శ్రేణులంతా కులం పేరుతో, మతంపేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరాదని సూచించారు. బీఆర్ఎస్లో చేరిన పలువురు యువకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్, నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి చేస్తున్న కృషిని చూసి బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తిర్పెల్లి గ్రామం నుంచి అత్యధిక ఓట్లు బీఆర్ఎస్కే పడేలా చూస్తామన్నారు.