జగిత్యాల : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ( MP Tejasvi Surya ) చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao) అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న కేసీఆర్( KCR ) ‘ ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్రావు మాట్లాడారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఎంపీ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సపోర్టుగా నిలిచారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడితే తెలంగాణలో 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీ లు ఉన్నా ఏం లాభమని అన్నారు. బీజేపీ ఎంపీ బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆత్మగౌరాన్ని దెబ్బ తీసిన ఎంపీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని వెల్లడించారు. బడేబాయి, చోటే బాయి బంధం మరో సారి బయటపడిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎంపీ లు పార్లమెంట్లో లేని లోటు నిన్న స్పష్టంగా కన్పించిందని హరీష్రావు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం, ప్రజల మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మహిళా బిల్లు విషయం లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నాటకామాడుతున్నాయని విమర్శించారు.ఎంపీ తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఇప్పటి వరకు ఖండించలేదని,రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని, దానికి నిదర్శనం బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరిక అని స్పష్టం చేశారు. రాజకీయల్లో విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి జీవన్ రెడ్డి అని కొనియాడారు.