ఆదిలాబాద్: ఆదివాసీ గిరిజనులు అభివృద్ధి కాకుండా అడ్డుపడుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని మోదీయే (PM Modi) .. ఈ మాట అన్నది ఎవరో కాదు ఆ పార్టీ నాయకులు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు (MP Soyam Bapu Rao). అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. బోథ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే ఆయన పోటీ చేస్తున్నారు. బోథ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.