హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా ఇతర మంత్రుల మేడిగడ్డ పర్యటనపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సెటైర్లు వేశారు. మేడిగడ్డ పిక్నిక్ బాగుందా? మంచి టిఫిన్లు, భోజనం పెట్టారా? అని కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి కామెంట్ చేశారు. మీ సీఎం మంచోడని, ఎప్పుడు మూడొస్తే అప్పుడు మేడిగడ్డ టూర్కు తీసుకెళ్లారని సెటైర్ వేశారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. వాటిని నెరవేర్చేందుకు దేశ బడ్జెట్ కూడా సరిపోదని పేర్కొన్నారు. అసెంబ్లీలో మరోమారు ఏబీసీడీ వర్గీకరణ తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్తో తమ పార్టీ ఒప్పందం చేసుకున్నదంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ పని చేయడంలేదని ప్రశ్నించారు.
బీజేపీఎల్పీ నేతగా మహేశ్వర్రెడ్డి
అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఎంపికయ్యారు. మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో బీజేపీ ఎల్పీ నేత ఎవరినే ప్రశ్నకు రెండు నెలల తర్వాత తెరపడింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్, కాటిపల్లి రమణారెడ్డిని నియమించారు. బీజేపీ చీఫ్ విప్గా డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు, విప్గా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను నియమించారు. కోశాధికారి బాధ్యతలను రాకేశ్రెడ్డికి అప్పగించారు. మండలిలో బీజేపీ పక్ష నేతగా ఏవిఎన్రెడ్డి నియమించారు. అయితే మొదటి నుంచి బీజేపీ ఫ్లోర్ లీడర్గా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్న సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పూర్తిగా పకన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.