హైదరాబాద్, డిసెంబర్ 20(నమస్తే తెలంగాణ): శ్వేతపత్రం పేరుతో రాష్ట్ర విశ్వసనీయత, ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. శ్వేతపత్రాల వల్ల రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, కంపెనీలు రాకుండా పోతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉన్నదని, కాబట్టి తెలంగాణను అప్పులు రాష్ట్రంగా క్రియేట్ చేయవద్దని కోరా రు. రాష్ట్రం నెత్తిపై భారీ అప్పు ఉన్నదని తెలిస్తే మళ్లీ రుణాలు వస్తాయా? అని ప్రశ్నించారు.