BJP | రాష్ట్ర బీజేపీకి మరోసారి అసమ్మతి సెగ తగిలింది. బీజేపీ నేత జి.వివెక్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావులపై స్థానిక బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుకు వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో బీజీపీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్తకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుపై సమావేశంలో బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు.
మరోవైపు జి.వివేక్ వెంకటస్వామి ఒంటెద్దు పోకడలకు వెళ్తున్నారని స్థానిక బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్మీట్ పెట్టారు. వివేక్ ఇలాగే వ్యవహరిస్తే మద్దతు ఇవ్వబోమని హెచ్చరించారు.