నిర్మల్ అర్బన్, నవంబర్ 28: నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్పేట (వైఎస్ఆర్నగర్ కాలనీ)లో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నేతలు దాడి చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న ఇరుపార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా తారసపడ్డారు. ఈ క్రమంలో ఐకే డౌన్డౌన్ అంటూ బీజేపీ నేతలు నినదించడంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకొన్నారు. దీంతో బీజేపీ నేతలు.. బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలపై రాళ్లతో దాడి చేశారు.
ఈ దాడిని మంత్రి ఇంద్రక రణ్రెడ్డి ఖండించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి తన అనుచరులతో దాడి చేయించారని మంత్రి పేర్కొన్నారు. ఇదిలావుండగా, బాసరలో అమ్మవారి దర్శనాంతరం ముథోల్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ్రావు మీడియా సమావేశం ఏర్పాటుచేసి, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు. దీనిపై ఎన్నికల అధికారికి ఆలయ ఈవో ఫిర్యాదు చేశారు.