హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 6 : కాషాయ పార్టీ కపట నాటకాలకు తెరలేపింది. హుజూరాబాద్లో సానుభూతి పొంది, ఉపఎన్నికలో ఎలాగైనా విజ యం సాధించాలన్న ఆశతో అడ్డదారులు తొక్కుతున్నది. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే గురువారం అర్ధరాత్రి జెండాగద్దె కూల్చివేత ఘటన. టీఆర్ఎస్పై నింద మోపి లబ్ధిపొందాలని చూసిన బీజేపీ నాయకు లు అబాసుపాలయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గం సింగాపూర్ గ్రామంలోని బీజేపీ జెండా గద్దెను, జెండాను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చి వేశారు. ఇది పథకం ప్రకారమే జరిగినా.. ఏమి తెలియదన్నట్టుగా బీజేపీ నాయకులు రాత్రికి రాత్రే అక్కడికి చేరుకొని హంగామా సృష్టించారు. జెండా గద్దెను టీఆర్ఎస్ వాళ్లే కూల్చివేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. హుజూరాబాద్ ఏసీపీ వెంకట్రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని, ఫిర్యాదు ఇస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పా రు. అయినా వినకుండా ఇంకా రచ్చ చేసేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి వాహనాలు ఆపడం మంచిది కాదని పోలీసులు హెచ్చరించడంతో అప్పుడు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశా రు. ఆ తర్వాత పోలీసులు సింగాపూర్ గ్రామంలో విచారణ చేపట్టి, పలు ఆధారాలు సేకరించారు. గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు గాలీబ్ అంజి ఈ గద్దెను కూల్చి వేశాడని తేల్చారు. అతడిపై కేసు నమోదు చేసినట్టు టౌన్ సీఐ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. గురువారం గ్రామంలో బీజేపీ నాయకులు గొడుగులు పంచారని, కానీ తనను తీసుకెళ్లలేదని, తనకు గొడుగు కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో పార్టీ జెండాను కూల్చి వేసినట్టు అంజి విచారణలో అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.