హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్పేట నియోజకవర్గానికి చెందిన బీజేపీ కీలకనేత బీఆర్ఎస్లో చేరారు. బాగ్ అంబర్పేట డివిజన్ సాయి మధురానగర్కు చెందిన బీజేపీ డివిజన్ కార్యదర్శి జమ్మిచెట్టు బాల్రాజ్ ఆదివారం తన కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గ అభివృద్ధికి రూ. 10 కోట్లు రాగా వాటిని కేంద్ర మంత్రి ఖర్చు చేయకపోవడంతో నిధులు మురిగిపోతున్నాయని ఆరోపించారు.
ముఖ్యంగా గెలిచిన నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు తీవ్ర నిరాశ, నిస్పృలతో ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. బీజేపీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు సరైన గుర్తింపు లేక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని వివరించారు.
15 ఏండ్లు ఎమ్మెల్యేగా, మూడేండ్లుగా కేంద్ర మంత్రిగా పని చేస్తున్న జి.కిషన్రెడ్డి నియోజకవర్గమైన అంబర్పేటను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సాయిమధురానగర్లో స్థానికుల కోరిక మేరకు కమ్యూనిటీహాల్ను కట్టిస్తానని చెప్పారు. మహిళలు ఐక్యంగా ముందుకు వచ్చి ఏదైనా ఉపాధి శిక్షణ పొందుతామంటే వారికి తగిన సహకారం అందజేస్తానని పేర్కొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో ఎ.రాములు, ఎం.రాజు, కె.రాజు, టీవీ శేఖర్, శ్రావణ్, దుద్యాల శివ, తిరుమని వెంకట్, మురళీ, శేఖర్, సందీప్, ప్రణయ్, గురు, అరవింద్, ప్రసాద్, కుమార్, మల్లేశ్, వెంకటచారి, కృష్ణ, మహిళలు వేదవతి, మీనా, రేఖ, వరలక్ష్మి, ధనలక్ష్మి, రూప, రోహిణి, పద్మ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు రవీందర్రావు, కోట్ల సంతోష్, రమేశ్ నాయక్, మిర్యాల రవీందర్, అరుణ్రెడ్డి, సి.మల్లేష్యాదవ్, శివాజీయాదవ్, బి.నర్సింగ్రావుయాదవ్, ఇ.ఎస్.ధనుంజయ, విజయ్, సునీల్, నవీన్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.