ముషీరాబాద్, జనవరి 4: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మాజీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ విజయలక్ష్మి తన అనుచరులతో కలిసి బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బంజారాహిల్స్లోని తన నివాసంలో ఆమెకు కవిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జాతీయ దృక్పథంలో బీఆర్ఎస్లో చేరిన ప్రముఖులకు తగిన గుర్తింపు ఇవ్వనున్నట్టు కవిత తెలిపారు. బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో విస్తరించే దిశగా సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు తమవంతు అండగా నిలుస్తామని విజయలక్ష్మి పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, కొండపల్లి మాధవ్, శ్యామ్సుందర్, ప్రసన్న, శివ ముదిరాజ్, దీన్దయాల్రెడ్డి, బొట్టు శ్రీనివాస్, బల్ల శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.