హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తె లంగాణ): తనకు రాజకీయంగా జన్మనిచ్చిన చేవెళ్ల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, పైసలు, పనుల కోసం కాదని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జీ రంజిత్రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహేశ్వర్రెడ్డి తనపై చేసిన ఆరోపణలు ని రూపిస్తే తాను దేనికైనా సిద్ధమని రంజిత్రెడ్డి సవాల్ విసిరారు.
చేవెళ్లకు వచ్చిన మహేశ్వర్రెడ్డి ఎవరో రాసిచ్చిన స్రిప్ట్ను చదివి ప్రెస్మీట్లో మాట్లాడటం నిజంగా దారుణమని విమర్శించారు. ఏదైనా అంశంపై మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూ చించారు. సీతారాంపూర్ భూముల వ్యవహారంలో తన పాత్ర ఏమీ లేదని, ఆ వ్యవహారమంతా తాను ఎంపీ కాకముందే జరిగిందని, ఈ విషయం మహేశ్వర్రెడ్డి తెలుసుకోవాలని హితవు చెప్పారు.