వేములవాడ రూరల్, జూలై 8: శ్రీరాజరాజేశ్వర జలాశయంలో ముంపునకు గురైన నిర్వాసిత కుటుంబానికి పట్టా ఇప్పిస్తానని ఓ బీజేపీ నాయకుడు మోసం చేయగా బాధితులు పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. బాధితుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకెపల్లికి చెందిన వల్లంపట్ల లక్ష్మికి చెందిన ఇల్లు, భూమి మిడ్మానేరులో ముంపునకు గురికాగా పట్టా రాలేదు. అదే గ్రామానికి చెందిన బీజేపీ నేత పట్టా ఇప్పిస్తానని రూ.40 వేలు తీసుకున్నాడు. పట్టా రానందున తన డబ్బులు వాపస్ ఇవ్వాలని కోరితే బెదిరించాడు. డబ్బులను అప్పుగా తెచ్చానని వేడుకున్నా పట్టించుకోకపోవడంతో లక్ష్మి శనివారం వేములవాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బీజేపీ నేత తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.