1984లో బీజేపీకి కేవలం రెండే ఎంపీ సీట్లు ఉండేవని, అద్వానీ చేపట్టిన రథయాత్ర తర్వాత పార్టీ రూపురేఖలు మారిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి గుర్తింపు తెచ్చిన అద్వానీ పోయి ఇప్పుడు అదానీ వచ్చారని ఎద్దేవా చేశారు. మోదీ తన జీవిత చరిత్ర రాసేటపుడు అద్వానీ నుంచి అదానీ వరకు అని రాసుకోవాలని చురకలంటించారు.
‘బీజేపీ అంటే బైరూపీ (బహురూపీ) పార్టీ, దానికి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి అనేక రూపాలున్నాయి. ప్రతిపక్ష నేతలను భయపెట్టడానికి, బురద చల్లడానికి ఏ రూపాన్ని ఎప్పుడు వాడాలో వారికి బాగా తెలుసు. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ప్రధాని అంటారు. కానీ, వందేభారత్ రైలును బర్రె గుద్దితేనే ముందరి భాగం విరిగిపోయింది. పైన పటారం.. లోన లొటారం’ అని విమర్శించారు.