బండ్లగూడ, నవంబర్14: బీసీలు రాజకీయంగా ఎదగడం ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీ మంత్రులపై ఐటీ, ఈడీ దాడులను చేయిస్తున్నదని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ విమర్శించారు. రాజేంద్రనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ గెలుపును జీర్ణించుకోలేకనే కేంద్రం రాష్ట్ర మంత్రులపై దాడులను చేపడుతున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలు అన్ని రాష్ర్టాల్లో చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు.