వీణవంక, సెప్టెంబర్ 8: ప్రజలకు పైసా పని చేయని బీజేపీకి ఓట్లు అడిగే నైతికహక్కు లేదని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. కరీంనగర్ జిల్లా వీణకవంక మండలం దేశాయిపల్లిలో బుధవారం జరిగిన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కరీంనగర్ ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు పోలు లక్ష్మణ్తోపాటు మరికొందరు బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముదిరాజ్ల సంక్షేమానికి వెయ్యి కోట్లు మంజూరుచేసిందన్నారు. మత్స్యకారులకు మోటర్ సైకిళ్లు, 150 కోట్లతో లగేజీ ఆటోలు, 65 కోట్లతో హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాకేంద్రాలకు మొబైల్ ఫిష్ ఔట్లెట్ వాహనాలు అందజేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. త్వరలోనే 609 జీవో అమలుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలిచ్చి ప్రజల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుం టే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడంతోపాటు రైతులు పం డించిన దొడ్డు వడ్లను కొనలేమంటున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, కౌశిక్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి డీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి
జమ్మికుంటలో జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, మాజీ ఎంపీపీ గంగారపు లత, మాజీ వైస్ ఎంపీపీ చుక్కా రంజిత్, నాయకులు శ్యాం, సురేందర్, చందు, రమేశ్తోపాటు వెయ్యి మంది మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కోరుకంటి చందర్, నన్నపునేని నరేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి, శ్రీధర్రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్రావు పాల్గొన్నారు.
రైతులను ఆదుకోండి..
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును కోరారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పం దించినట్టు బాల్క సుమన్ తెలిపారు.