సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి అమిత్షా తుక్కుగూడ బహిరంగ సభలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అధికారం ఇస్తే.. మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం ద్వారా ప్రజల్లో మతపరమైన విభజన సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
ఓట్ల కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ చేస్తున్న కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.