హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగానే కాంగ్రెస్ ప్రభు త్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేయ డం ఏంటని అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఇతర నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులతోనే బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్ల వారీగా పోలీసుల సమక్షంలోనే విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. దీనిపై తాము ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్, పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉం దా..? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించడమే అని మండిపడ్డారు.
గజ్వేల్, నల్లగొండ కార్పొరేషన్లను విభజించడం చట్ట వ్యతిరేక నిర్ణయమని విమర్శించారు. బెంగళూరులో కాంగ్రెస్ ప్రభుత్వం 12% కమీషన్ వసూలు చేస్తే, తెలంగాణలో 30% ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో వసూలు చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ను మొదటి విడతగా కేరళ ఎన్నికలకు మళ్లించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కార్పొరేషన్ల ఏర్పాటులో రాష్ట్ర ఎన్నికల సంఘం విధివిధానాలు, సెన్సస్ మార్గదర్శకాలను సర్కార్ ఉల్లం ఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.