HomeTelanganaBjp Brokers Tried To Lure Trs Mlas In A Systematic Manner
అపరేషన్ ‘క్యాషాయం’ – సాగిందిలా..
నిందితుల్లో ఒకరైన నందకుమార్.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డితో రామచంద్రభారతి స్వామిజీని కలిపించారు. సెప్టెంబర్ 26 వీరు మొదటిసారి కలుసుకొన్నారు. ఈ విషయమై రోహిత్రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు
నిందితుల్లో ఒకరైన నందకుమార్.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డితో రామచంద్రభారతి స్వామిజీని కలిపించారు. సెప్టెంబర్ 26 వీరు మొదటిసారి కలుసుకొన్నారు. ఈ విషయమై రోహిత్రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు స్వాముల కదలికలపై నిఘా సంస్థల నుంచి సమాచారం అందుకొని అప్పటినుంచి నిఘాను పటిష్ఠం చేశారు.
మరో పక్క బీజేపీ నాయకులు కూడా సమావేశాలలో తమతో పలువురు టచ్లో ఉన్నారంటూ చెప్తూ వచ్చా రు. దీంతో టీఆర్ఎస్ నాయకత్వం కూడా అప్రమత్తమయ్యింది.
పార్టీ మారాలంటూ ఆఫర్లు ఇచ్చేవారికి వెంటనే వద్దని చెప్పకుండా.. వారిని నమ్మిస్తూ ఎమ్మెల్యేలు వాళ్లతో మాటలు కొనసాగించారు.
ఢిల్లీ నుంచి స్వాముల పేరుతో వచ్చి హైదరాబాద్లో భారీ అపరేషన్కు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయనే విషయంపై నిఘా సంస్థలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ శివారుల్లోని ఫామ్ హౌస్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఎవరికీ అనుమానం రాకుండా, తనకు అఫర్ ఇచ్చిన వారితో టచ్లో ఉంటూ వాళ్లను ట్రాప్లో వేశారు.
మరో పక్క నిఘా సంస్థలకు వచ్చిన సమాచారంతో పోలీసులు మూడు రోజులుగా క్యాషాయం అపరేషన్పై ఫోకస్ పెట్టారు. స్వాములకు, ఎమ్మెల్యేలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న నందకుమార్ కదలికలపై దృష్టి పెట్టా రు. నందకుమార్ ఎవరెవరిని కలుస్తున్నారనే సమాచారాన్ని సేకరించారు.
బుధవారం స్వాములు హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్లో కలుసుకోవడానికి వస్తున్నారనే సమాచారంతో ముందస్తుగానే పోలీసులు అక్కడ నిఘా పెట్టారు.
రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ఫామ్ హౌస్కు చేరుకున్నారు. వీళ్లను నమ్మించేందుకు ఒక్కడే కాకుండా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలను రోహిత్రెడ్డి అక్కడకు రప్పించారు.
స్వామిజీలు, నందకుమార్ పార్టీ ఫిరాయింపులు, ప్రలోభాలపై పిచ్చాపాటిగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయారు.
ఢిల్లీ నుంచి ఒక ప్రముఖుడితో స్వాములు సంప్రదించిన సమాచారాన్ని ఎమ్మెల్యేలు పోలీసులకు ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు.