హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే బీజేపీ నేతలు(BJP leaders) చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎఫ్డీసీ చైర్మన్(FDC Chairman) అనిల్ కూర్మాచలం విమర్శించారు. బీజేపీ పార్టీ బతుకంతా ఫేక్..లీక్ లేనని, ఆరోపించారు. తమ స్వార్ధ రాజకీయ అవసరాల కోసం పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులను, తల్లితండ్రులను, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మండి పడ్డారు.
తప్పుచేసి అడ్డంగా దొరికినప్పటికీ బండి సంజయ్ని బీజేపీ పార్టీ నేతలు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. ఎంపీ గా కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. బీజేపీ నాయకుల డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వీరికి తగిన బుద్ది చెప్తారని వెల్లడించారు.
ఈ ప్రశ్నపత్రాల లీక్ వెనక ఉన్న వారందరిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థులు ఎటువంటి ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఆరోపించారు.గతంలో విద్యార్థులంతా చదువులు పక్కనపెట్టి తమ వెంట రావాలని పిలుపునిచ్చిన బండి సంజయ్, అదే ప్రణాళికతోనే లీకుల కుట్రకు తెర లేపారని వివరించారు.