యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్(BRS)ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ నాయకులు(BJP) విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకుంటున్నారని ఎమ్మెల్సీ(MLC), తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గే మల్లేశం ఆరోపించారు. యాదగిరిగుట్ట మండలం బాహుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదవ తరగతి పరీక్షా పత్రం లీకేజీ(Tenth papers) వ్యవహారంపై బీజేపీ రాజకీయాలు చేయడం తగదన్నారు. బీఆర్ఎస్ పార్టీపై కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని అన్నారు.
జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడే ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడడం బాధాకరమని అన్నారు. కేసీఆర్(KCR) ఉన్నంతవరకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో గుజరాత్(Gujarat) రాష్ట్రాన్ని మించిపోవడాన్ని జీర్ణించుకోలేక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి కుట్రపూరిత చర్యలు చేస్తుందని విమర్శించారు. ఇటువంటి కుయుక్తులను తెలంగాణ సమాజం సహించదు. క్షమించదని అన్నారు. బీజేపీ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.