మునుగోడు, ఆగస్టు 24 : తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పులిపలుపుల పరిధిలోని బీరెల్లిగూడేనికి చెందిన బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంపల్ల వెంకన్న, కాంగ్రెస్కు చెందిన వెంపల్ల శంకర్, దాసరి రమేశ్తోపాటు సుమారు 200 మంది కార్యకర్తలు కాశవారిగూడెంలో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి చేరికల జోరు
నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు అన్వర్, పాండు, రహీం, బషీర్తోపాటు మహిళలు సుమారు 200 మంది మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఆర్నకొండకు చెందిన బీజేపీ ఎంపీటీసీ గొల్ల సునంద, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గొల్ల గట్టయ్య, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కాయిత సాయిక్రిష్ణ, బీజేపీ మాజీ అసెంబ్లీ కన్వీనర్ మొగిలిసారయ్య, సీనియర్ కార్యకర్తలు గొల్లవెంకటనర్సు, జువ్వాజి శేఖర్ భూర్గుపల్లిలోని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.