హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. రైతులు, పేదలు రెండు కండ్లుగా పరిపాలన సాగిస్తూ.. తెలంగాణ రాష్ర్టాన్ని సుభిక్షం చేశారని కొనియాడారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, రైతు నాయకులు బుధవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ప్రశాంత్రెడ్డి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ దార్శనిక పాలన వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలిచిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దార్శనిక మాడల్ను యావత్తు దేశం కోరుకుంటున్నదని చెప్పారు. కేసీఆర్ పాలన, పార్టీ విధానాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరిన ప్రతీ ఒక్కరికీ పార్టీపరంగా, వ్యక్తిగతంగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో పన్నాల గంగారెడ్డి, ముత్యాల లక్ష్మణ్గౌడ్, సింగిరెడ్డి ముత్యంరెడ్డి, సింగిరెడ్డి గంగారెడ్డి, కూలిపాటి గంగారెడ్డి, గోవింద్ గంగాధర్, కొమ్ముల కిషన్, రైతు నాయకులు కొమ్ముల రాజేందర్, కొమ్ములు శ్రీధర్, కొమ్ముల మహిపాల్, సింగిరెడ్డి బాలకృష్ణ, సింగిరెడ్డి బాల్రెడ్డి, వేముల మోహన్రెడ్డి, వేముల శివారెడ్డి, రేంజర్ల రోహిత్రెడ్డి, సింగిరెడ్డి జలపతిరెడ్డి, గోపిడి రాజేందర్, సంత రాజేందర్, కొమ్ముల రాజేందర్ ఉన్నారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగుంట దేవేందర్, నాయకులు అహ్మద్, లుకా గంగాధర్, బద్ధం చిన్నారెడ్డి, బద్రి రాజేశ్వర్, హల్దే శ్రీనివాస్, సుమన్, సంత రాజేశ్వర్, కో-ఆప్షన్ సభ్యుడు పాషా, సుధాకర్, హరీశ్రెడ్డి, మహేందర్, బోడ దేవేందర్, సదాశివ్ పాల్గొన్నారు.