నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు గూండాయిజానికి దిగారు. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకు వెళ్తున్న టీఆర్ఎస్ శ్రేణులపైనా బీజేపీ గూండాలు రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోనే బీజేపీ రౌడీలు ఈ దాడులకు తెగబడ్డారు. బీజేపీ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ జగదీశ్ సహా పలువురికి గాయాలయ్యాయి.
ఓటమి భయంతోనే బీజేపీ.. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవబోతుందని తెలిసి బీజేపీ నిరాశ, నిస్పృహతో ఇలాంటి కుట్రలకు చేస్తుందని హరీశ్రావు ధ్వజమెత్తారు.