జన్నారం, ఫిబ్రవరి 13: మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో నిర్వహించిన బర్డ్వాక్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. మొదటి రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు పక్షులపై అధ్యయనం చేశారు. రెండో రోజూ ప్రత్యేక వాహనాల్లో అటవీ ప్రాంతంలో కలియదిరుగుతూ వివిధ రకాల పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. బైనాక్యులర్ ద్వారా పాలపిట్ట, బ్రహ్మణి స్లరింగ్, ఎర్ర కొంగలు, వివిధ రకాల పక్షులను పరిశీలించారు. 300కుపైగా అరుదైన పక్షిజాతులను గుర్తించారు. వీరి వెంట ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శోభ, నిర్మల్, ఆదిలాబాద్ సీసీఎఫ్లు వినోద్కుమార్, రామలింగ, మంచిర్యాల, ఆసిఫాబాద్ డీఎఫ్వోలు శివాణిడోంగ్రి, శాంతారాం, ఎఫ్డీవో మాధవరావు తదితరులు ఉన్నారు.