హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలి బయోబ్యాంక్ హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో ప్రారంభమైంది. ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ మంగళవారం దీన్ని ప్రారంభిం చారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ బయోబ్యాంక్ జ న్యు పరిశోధనలకు ఎంతో ఉపకరిస్తుందని, దీనిలో 3 లక్షలకు పైగా నమూనాలను ఏకంగా 15 ఏండ్లపాటు నిల్వ ఉంచవచ్చని డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు.
భవిష్యత్తు అవసరాల కోసం మానవ కణజాల నమూనాల సంరక్షణ, విశ్లేషణకు ఎంతో ఉపయో గపడే అత్యాధునిక బయోబ్యాంకును ఏఐజీ దవాఖానలో ప్రారంభించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.